ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత - TS TRT

Post Top Ad

Your Ad Spot

Monday, 8 June 2015

ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య ఈరోజు (08/06/2015) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్దతులను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.రంగాచార్య జీవిత విశేషాలు...* 1928లో వరంగల్‌ జిల్లా చినగూడూరులో జన్మించారు.* నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.* 1951-57 మధ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.* 1957-88 మధ్య సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.* 'చిల్లర దేవుళ్లు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.* తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు.* శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.* 'జీవనయానం' పేరుతో ఆత్మకథను
రచించారు.* అభినవ వ్యాసుడిగా బిరుదు పొందారు.* దేహదాసు ఉత్తరాలు, శ్రీ మహాభారతము, జీవనయానం, చతుర్వేద సంహిత, అమృత ఉపనిషత్తు, అమృతంగమయ తదితర రచనలు చేశారు.కేసీఆర్‌ సంతాపందాశరథి రంగాచార్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి రంగాచార్య అని ఆయన కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన దాశరథి:
చంద్రబాబుప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. సాహితీ ప్రక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు.


No comments:

Post a Comment

Post Top Ad