కరీంనగర్లోని భగత్నగర్కి చెందిన కామారాపు లక్ష్మి అనే తొమ్మిది నెలల గర్భిణి 30 నిమిషాల 20 సెకన్లలో 5 కి.మీ పరుగు పూర్తి చేసి తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్ల పరుగు చేయడం వల్లనే సుఖ ప్రసవం జరిగిందని, రెండో కాన్పు కూడా సుఖ ప్రసవం కోసం 5కిలో మీటర్లు పరుగు చేపట్టి గిన్నిస్ బుక్లో పేరు నమోదు కోసం ప్రయత్నించినట్లు లక్ష్మి తెలిపారు. కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ బృందం, వైద్యులు, క్రీడా సంఘాల సమక్షంలో లక్ష్మి 5కి.మీ పరుగు పూర్తి చేశారు. అనంతరం లక్ష్మిని తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సత్కరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు వివరాలు అందజేయనున్నట్లు తెలిపారు.
Post Top Ad
Your Ad Spot
Saturday, 25 April 2015
గిన్నిస్ బుక్ రికార్డు కోసం... 9నెలల గర్భిణి 5కి.మీ పరుగు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment